ఎ.బి.కె. ప్రసాద్ కు “జాతీయ అవార్డు”

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా – “రాజా రామ్ మోహన్ రాయ్ జాతీయ అవార్డు”కు ఎంపికైన డాక్టర్ ఎ.బి.కె. ప్రసాద్’

జర్నలిజం రంగంలో అత్యుత్తమమైన సేవలు అందించినందుకు ప్రతిష్టాత్మకమైన రాజా రామ మోహన్ రాయ్ అవార్డుకు డాక్టర్ ఏబికె ప్రసాద్ ను ఎంపిక చేసినట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
ఏబికె గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ పాత్రికేయ రంగంలో 75 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి యున్నారు. ఆధ్ర ప్రదేశ్ నుంచి వెలువడిన ఈనాడుతో సహా పలు ప్రధాన పత్రికలకు సంపాదకులుగా పనిచేసిన అరుదైన గౌరవం వీరికి దక్కింది. 2004-2009 వరకు ఆంధ్ర ప్రడేశ్ రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షులుగా కూడా శ్రీ ఏబికె పనిచేశారు.
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ శ్రీమతి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వం లోని కమిటి ఈ అవార్డు ను ప్రకటించింది. ఫిబ్రవరి 28 న డిప్యూటీ స్పీకర్ హాల్, కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా, రఫీ మార్గ్, న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్దు ప్రదానోత్సవం జరుగుతుంది.

SA: