

ప్రముఖ చిత్రకారులు రోహిణి కుమార్ కు సంస్కృతి పురస్కార ప్రదానం
ఆజాదీకా అమృత్ మహోత్సవాల సందర్భంగా రంగారెడ్డి జిల్లా హైదర్ గూడ గ్రామములో ఉన్న సంస్కృతి కళా కేంద్రంలో నేడు (13-08-2022) “భారత్ హమారా” అంతర్జాతీయ బాలల చిత్రకళా ప్రదర్శన ప్రారంభం మరియు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ చిత్రకారులు రోహిణి కుమార్ గారు పాల్గొని విజేతలకు బహుమతులు పంచి సావనీరును ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రోహిణి కుమార్ గారిని సంస్కృతి పురస్కారముతో సన్మానిచారు. మన దేశానికి చెందిన బాలల చిత్రాలతో పాటు ఏడు దేశాలకు చెందిన బహుమతులు పొందిన బాలల చిత్రాలు కూడా ఈ ప్రదర్శనలో ప్రదర్శింపబడినవి. ఈ ప్రదర్శన ఈనెల 30 తేదీ వరకు కొనసాగుతుంది.
ఈ కార్యక్రమంలో కన్వీనర్ బి. సుధా రెడ్డి, ప్రముఖ చిత్రకారులు, జ్యూరీ చైర్మేన్ బి.ఏ. రెడ్డి గార్లు తదితరులు పాలొగొన్నారు.
