స్త్రీ పాత్ర పోషణలో దిట్ట బుర్రా

(ఈరోజు వారి జయంతి -9-2-1937)

బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి గారు,స్త్రీ పాత్రధారణలో గొప్ప పేరు సంపాదించుకొన్న నటరత్నం. కృష్ణా జిల్లా, అవనిగడ్డ దగ్గర పోతుగడ్డ లో పద్మనాభ సోమయాజి, సీతామహాలక్ష్మి దంపతులకు1937, ఫిబ్రవరి 9 న జన్మించారు.

శాస్త్రి గారిమేనమామ కొటేశ్వరరావు స్వతహాగా హరిదాసుఉత్తమ గాయకుడు కావడంతోమేనమామ పర్యవేక్షణలో పద్యాలు, పాటలు శ్రావ్యముగా ఆలపించడం నేర్చుకున్నారు. వానపాముల సత్యనారాయణ వద్ద పద్యాలు భావయుక్తముగా పాడటం, నేర్చుకున్నారు.

శాస్త్రి గారి నటనా విశిష్ఠత గుర్తించిన బి.వి. నరసింహారావు నాట్యశాస్త్రములోని నూతన ప్రయోగ రీతులన్నీ నేర్పారు. శాస్త్రిగారికి తగినంత ప్రోత్సాహమిచ్చి నాటకరంగాన నిలిపి ఉత్తమ స్త్రీ పాత్రధారిగా తీర్చి దిద్దారు.

అకుంఠిత కార్యదీక్షతో శాస్త్రిగారుఉత్తమ స్త్రీ పాత్రలైన సత్యభామ, చింతామణి, సక్కుబాయి, చంద్రమతి, మోహిని, మాధురి, ద్రౌపది, శశికళ, వరూధిని, తార, అనార్కలిమొదలైన పాత్రలనుఅవలీలగా, అద్భుతంగాపోషించి స్త్రీ పాత్రధారణలో ‘ఔరా’ అనిపించుకున్నారు.

స్వంతంగా సత్యసాయిబాబా నాటక సమాజము స్థాపించి నాటక ప్రదర్శనలిచ్చి రసజ్ఞులందరి మెప్పు పొందారు. శాస్త్రిగారిలో పాత తరం నటుల సంప్రదాయాలైన క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర అన్వేషణ, నిత్యసాధన, కొత్త ప్రయోగాలపై తపన, ఆశయసాధన కనిపించేవి.

శాస్త్రిగారి స్త్రీ పాత్రలన్నింటిలోను ఒక నూతనత్వం గోచరిస్తుంది. కవి సృష్టించిన పాత్రకు న్యాయం చేస్తూ, మరొకవైపు సృజనాత్మక రూపం పాత్రకు ఆపాదింపచేసి సజీవ శిల్పం తో రాణింపు కలగచేస్తారు.

భావయుక్తమైన సంభాషణ విధానమూ, ఆ విధానానికి తగిన సాత్విక చలనమూ, ఆ చలనముతో సమ్మిళితమైన నేత్రాభినయనమూ, పలుకూ, కులుకూ, సొంపూ, ఒంపూ, హొయలు, ఒయ్యారాలతో నాట్యమయూరిలా, శృంగార రసాధిదేవతగా ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరయ్యేటట్లు నటించేవారు. వారిచూపు మన్మధ బాణంలా ఉండేది.

చింతామణి,సత్యహరిశ్చంద్ర, శ్రీకృష్ణతులాభారం, తారాశశాంకం, విశ్వదాభిరామ, సక్కుబాయి, అనార్కలి, షిరిడీ సాయిబాబా, సమ్మక్క-సారక్క మొదలైననాటకాలకు దర్శకత్వంవహించి, గొప్ప దర్శకుడుగా కూడాకొనియాడబడినారు.

శాస్త్రిగారి స్త్రీ పాత్రాభినయానికి ముగ్ధులైన విశ్వనాథ సత్యనారాయణ ‘నాట్యాచార్య’ బిరుదునిచ్చారు. ఆంధ్ర ప్రజానీకం ‘అభినయ సరస్వతి’ అని, కొండవీటి వెంకటకవి ‘నాట్యమయూరి’అని బిరుదులిచ్చారు. ఇంకా… లలితకళాప్రపూర్ణ,అభినయ సరస్వతి, అభినయ విశారద, కళారత్నతదితర బిరుదులు అందుకొన్నారు.

అనేక చోట్ల ఘన సన్మానాలు, స్వర్ణకంకణాలనూ అందుకున్నబుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన 84వ ఏట అనారోగ్యంతో 07-04-2019 హైదరాబాదులో కన్నుమూసారు.

SA: