“అతడే ఒక సైన్యం” గా ‘స్వాతి బలరామ్’ బయోపిక్

“అతడే ఒక సైన్యం” గా ‘స్వాతి బలరామ్’ బయోపిక్

March 23, 2023

బయోపిక్ సినిమాల నిర్మాణంలో ప్రత్యేక నైపుణ్యం సాధించిన రచయిత డాక్టర్ ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో, ఈనాడు పత్రికా రంగంలో మకుటం లేని రారాజుగా వెలుగొందుతున్న స్వాతి వారపత్రిక సంపాదకులు-పబ్లిషర్ అయినటువంటి వేమూరి బలరామ్ గారి బయోపిక్ సినిమా నిర్మాణం 30 మార్చి, 2023 శ్రీరామనవమి శుభ ముహుర్తాన విజయవాడలోని హోటల్ ఐలాపురంలో ప్రారంభం కానుంది. ‘స్వాతి’ బలరామ్ గురించి…

స్త్రీలసాహిత్యంలో ఆద్యురాలు ‘నాయని’

స్త్రీలసాహిత్యంలో ఆద్యురాలు ‘నాయని’

March 14, 2023

తెలుగు రచయిత్రి. ఆమె తొలితరం తెలుగు జానపదసాహిత్యం, స్త్రీలసాహిత్యంలో విశేషకృషి చేసిన ఆద్యురాలు, జానపదవాఙ్మయానికి సాహిత్యస్థాయికి గుర్తింపు తెచ్చిన వారు, కథ, కవిత్వం, నవల, చరిత్ర, విమర్శ, ప్రక్రియల్లో రచనలు చేసిన వారు, భావకవి, భారత స్వాతంత్ర్య సమరయోధుడు నాయని సుబ్బారావు గారి కుమార్తె నాయని కృష్ణకుమారి జన్మదిన జ్ఞాపకం. నాయని కృష్ణకుమారి (మార్చి 14, 1930 –…

దర్భశయనం కి ‘ఇంద్రగంటి’ పురస్కారం

దర్భశయనం కి ‘ఇంద్రగంటి’ పురస్కారం

March 13, 2023

ప్రముఖ కవి, సంస్కృతాంధ్ర పండితుడు, విమర్శకుడు, రచయిత శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ పేరు మీద ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ‘ఇంద్రగంటి శ్రీకాంత శర్మ సాహితీ పురస్కారం’, 2022వ సంవత్సరానికి గాను విలక్షణ కవి దర్భశయనం శ్రీనివాసాచార్య గారికి ప్రదానం చేయబడింది. శ్రీకాంత శర్మ గారి తనయుడు ఇంద్రగంటి మోహనకృష్ణ స్వగృహంలో, ఆత్మీయులైన మిత్రులు, కుటుంబ…

పుస్తకాలు కొని చదివేవారు ఇప్పటికీ వున్నారు

పుస్తకాలు కొని చదివేవారు ఇప్పటికీ వున్నారు

March 7, 2023

(మందరపు హైమావతి గారి ‘పలకరింపు’ – కొత్త ఫీచర్ ప్రారంభం..) ……………………………………………….. నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. అలా ప్రచురణ రంగంలో చిన్న నాడే అడుగిడి, ఆ ప్రచురణ సంస్థ పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న ‘ఎమెస్కో లక్ష్మి’ గారిని (మార్చి 8, మహిళా దినోత్సవం సందర్భంగా…) ఇంటర్ వ్యూ చేశారు మందరపు హైమావతి.కొన్నేళ్ళ కిందట విశాలాంధ్రలో…

‘మాతృభాషా సేవాశిరోమణి’ పురస్కారాలు

‘మాతృభాషా సేవాశిరోమణి’ పురస్కారాలు

February 21, 2023

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ‘మాతృభాషా సేవాశిరోమణి’ పురస్కారాలు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం తెలుగు భాషాభివృద్ధికోసం కృషి చేసిన కళాకారులను, భాషోకోవిదులను, సాహితీవేత్తలను, జర్నలిస్టులను ఒక వేదికపైకి తీసుకొచ్చి ‘మాతృభాషా సేవాశిరోమణి’ పురస్కారాలతో సత్కరించింది. విజయవాడ గవర్నరుపేటలోని హోటల్ పార్క్ ఐరిస్ ప్రైమ్ లో మంగళవారం(21-02-2023) ఉదయం జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవ…

సాహితీ తపస్వి ‘మునిసుందరం’

సాహితీ తపస్వి ‘మునిసుందరం’

February 14, 2023

ప్రముఖ రచయిత, కథలు, కథానికలు, నవలలు, నాటకాలు విస్తృతంగా రాసినచిత్తూరు జిల్లా రచయితల సంఘం వ్యవస్థాపకులు శింగు మునిసుందరం గారి స్మృతి దినం ఈ రోజు !—————————————————– ఆ యువకుడి వైపు అలానే చూస్తూ ఉండిపోయారు గరికిపాటి రాజారావు. తనను చూడడానికి వచ్చిన ఆ విద్యార్థి కళ్ళలో కన్పిస్తున్న వినయం, నిలబడిన పద్ధతిలో ప్రకటితమయ్యే వినమ్రత, అభివాదం చేసే…

ఎ.బి.కె. ప్రసాద్ కు “జాతీయ అవార్డు”

ఎ.బి.కె. ప్రసాద్ కు “జాతీయ అవార్డు”

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా – “రాజా రామ్ మోహన్ రాయ్ జాతీయ అవార్డు”కు ఎంపికైన డాక్టర్ ఎ.బి.కె. ప్రసాద్’ జర్నలిజం రంగంలో అత్యుత్తమమైన సేవలు అందించినందుకు ప్రతిష్టాత్మకమైన రాజా రామ మోహన్ రాయ్ అవార్డుకు డాక్టర్ ఏబికె ప్రసాద్ ను ఎంపిక చేసినట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.ఏబికె గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ అన్నే…

సంపాద‘కవి’త్వ సంపుటి

సంపాద‘కవి’త్వ సంపుటి

February 7, 2023

కలం తిరిగిన చేయి వ్రాసేది ఏదయినా సృజననే కోరుకుంటుంది. సమాజం గొంతుకను అనుసరించే కలం కవిత్వాన్నే ఒలికిస్తుంది. ఈతకోట సుబ్బారావు ‘విశాలాక్షి’ సాహిత్య మాసపత్రిక సంపాదక బాధ్యతలతోపాటు రచయితగా ఇప్పటికి 15 పుస్తకాలను ప్రచురించారు. మరికొన్ని పుస్తకాలు వీరి సంపాదకత్వంలో పురుడు పోసుకున్నాయి.సుబ్బారావు ‘విశాలాక్షి’ సాహిత్య మాసపత్రిక సంపాదకీయ కవిత్వ ప్రక్రియను చేపట్టిన తొలినాళ్లల్లోనే కొత్తగా, కొంత వింతగా…

‘సిరిసిరిమువ్వ’ మూగబోయింది…

‘సిరిసిరిమువ్వ’ మూగబోయింది…

February 3, 2023

కాశీనాథుని విశ్వనాధ్ వెళ్లిపోయారు. మరో పదిహేను రోజులలో తన 94 వ పుట్టిన రోజు జరుపుకోకుండానే విశ్వనాధ్ వెళ్లిపోయారు. తన ఇరవై ఒకటవ ఏట శబ్ద గ్రాహకుడుగా సినిమా రంగంలో అడుగుపెట్టిన విశ్వనాధ్ ఆ తరువాత దర్శకుడుగా చరిత్ర సృష్టించారు. 1965లో వచ్చిన ఆత్మ గౌరవం ఆయన మొదటి సినిమా కాగా 2010 లో వచ్చిన శుభప్రదం ఆయన…

సీఎం వైఎస్‌ జగన్‌ కలిసిన ‘సిరివెన్నెల’ కుటుంబం

సీఎం వైఎస్‌ జగన్‌ కలిసిన ‘సిరివెన్నెల’ కుటుంబం

January 28, 2023

సిరివెన్నెల కుటుంబాన్ని ఆదుకున్నందుకు సీఎం వైఎస్‌ జగన్‌ కు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు! దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో సిరివెన్నెల అనుబంధాన్ని సీ.ఎం. జగన్ తో పంచుకున్న కుటుంబ సభ్యులు. సిరివెన్నెల అనారోగ్య సమయంలో చికిత్స ఖర్చులను భరించిన జగన్ సర్కార్ ఆ కుటుంబానికి విశాఖలో ఇంటి స్ధలం మంజూరు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌ కృతజ్ఞతలు…