గుంటూరు లో నాటకోత్సవాలు

గుంటూరులో స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కె.ఆర్.కె. ఈవెంట్స్ నిర్వహణలో డాక్టర్ కాసరనేని సదాశివరావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని డాక్టర్ కాసరనేని సదాశివరావు కళాసమితి 11వ నాటకోత్సవాలు 10-2-2023 శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు సంస్థ కన్వినర్ రామకృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న డాక్టర్ యర్రా నాగేశ్వరరావు 25మంది పేద విద్యార్ధులకు ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. సభలో డాక్టర్ పోసాని శ్రీనివాసరావు, యర్రా ఈశ్వరరావు, ఆలయ కమిటి సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. సభానంతరం పిన్నమనేని మృత్యుంజయరావు రచనకు నాయుడు గోపి దర్శకత్వం వహించిన గంగోత్రి, పెదకాకాని వారిచే ప్రదర్శించిన అస్తికలు నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది.

SA: