పోస్ట్ కార్డ్ ‘కథల’ పోటీలు

రమ్యభారతి పత్రిక ఆధ్వర్యంలో కోపూరి శ్రీనివాస్ స్మారక పోస్ట్ కార్డ్ కథల పోటీలు నిర్వహిచనున్నది.

విజేతలకు మొదటి బహుమతి రూ.1000/- ద్వితీయ బహుమతి: రూ. 800/-
తృతీయ బహుమతి: రూ.500/- లతో పాటు ప్రోత్సహక బహుమతులు: 2 కథలకి ఒకొక్కటి 200/- చొప్పున ప్రకటించారు.
సామాజిక స్పృహ కలిగిన ఏ అంశంమీదైనా కథలు పోస్ట్కార్డ్ప మాత్రమే రాసి పంపాలి. ఒక రచయిత మూడు కథలు వరకు పంపవచ్చు. విజేతలకు బహుమతి సొమ్ము ఫోనే, గూగుల్ పే, పేటియం ద్వారా పంపిస్తారు. ఏ ప్రాంతంలోఉన్న తెలుగు రచయితలైనా సరే, అందరూ ఈ కథల పోటీలో పాల్గొని.. మంచి కథలతో తెలుగు కథని పరిపుష్టం చేయవలసిందిగా కోరుతున్నారు. రచయితలు తమ కథలను అక్టోబర్ 31వ తేదిలోగా ‘రమ్యభారతి’ పోస్ట్బాక్స్ నెంబర్. 5, విజయవాడ-520001 చిరునామాకు పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలని రమ్యభారతి పత్రిక సంపాదకుడు చలపాక ప్రకాష్ తెలిపారు.

1 thought on “పోస్ట్ కార్డ్ ‘కథల’ పోటీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap