రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు

తోరం రాజా ఆద్వర్యంలో మే 1వ తేదీ నుండి మే 31వ తేదీల మధ్య రాష్ట్ర స్థాయిలో నాటకోత్సవాలు జరుగును.

విజయవాడ కేంద్రంగా మే1 వ తేదీ నుండి 10 వ తేదీ మధ్యలో 12 నాటికల ప్రదర్శనా పోటీలు జరపబడును.

విశాఖపట్నం నందు మే 11 వ తేదీ నుండి మే 20 వ తేదీ మధ్యలో 12 నాటికల ప్రదర్శనా పోటీలు జరపబడును.

తిరుపతి పట్టణంలో మే 21 వ తేదీ నుండి మే 31 వ తేదీ మధ్యలో 12 నాటికల ప్రదర్శనా పోటీలు జరపబడును.

ఒకోక్క నాటికకు ప్రదర్శనా పారితోషకం 12000 (పన్నెండు వేలరూపాయులు) అందజేయబడును.

ప్రధమ, ద్వితీయ మరియు తృతీయ ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులు మరియు వ్యక్తి గత బహుమతులు కలవు.

ఈ పోటీల్లో తెలుగు నాటిక ఏదైనను దరఖాస్తు పంపవచ్చును.

పాల్గోనవలెనని ఆశక్తి గలవారు తమ నాటక సంస్థ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్లు, నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు జాబితా, రచయిత అనుమతి పత్రం A4 పేజీ సైజులో కధా సంగ్రహం మరియు నాటక ప్రతి (స్క్రిప్ట్) మార్చి 30 వ తేదీ లోపు 7337088788 వాట్సాప్ ద్వారా పంపించగలరు.

ఈ ప్రదర్శనలలో పాల్గోను నాటక సమాజాల వారికి ప్రదర్శన రోజు మాత్రం భోజన, వసతి సదుపాయాలు మరియు స్టేజీ, సాదారణ మైకు,లైటింగ్, కర్టన్లు ఏర్పాటు చేయబడును.

గమనిక: నాటికల ప్రదర్శనలపై కమిటీ వారికి పూర్తి అధికారం కలదు.

వివరములుకు

తోరం రాజా
చిత్ర దర్శకుడు

7337088788
9393446336

SA: