ఘనంగా తానా ‘మదర్స్ డే – అమ్మా నీకు వందనం’

చరిత్ర సృష్టించిన తానా ‘మదర్స్ డే – అమ్మా నీకు వందనం’

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్వర్యంలో ఈ సంవత్సరం వినూత్నంగా అంతర్జాలంలో నిర్వహించిన “మదర్స్ డే 2020 వర్చువల్ పోటీలు ఘనంగా జరిగాయి. ఈ లాక్ డౌన్ సమయంలో “మదర్స్ డే” వేడుకలు నిర్వహించాలన్న పట్టుదలతో తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి గారి ప్రొత్సాహంతో, శిరీష తునుగుంట్ల, ఉమెన్స్ సర్వీసెస్ కో ఆర్డినేటర్, లక్ష్మి దేవినేని ఇంటర్నేషనల్ కో-అర్దినేటర్ నిర్వహణలో “తానా” సంస్థ అధ్వర్యంలో “జిజ్ఞాస”, “జయహో భారతీయం” “AP-NRTS “ సంస్థల సహకారంతో నిర్వహించిన ఈ వర్చువల్ గ్లోబల్ కాంపిటీషన్స్- 2020, చరిత్రలో ఒక సరికొత్త ప్రయోగం. వినూత్న అనుభవం. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 7 విభాగాలలో జరిగిన పోటీలలో వివిధ దేశాల నుండి తెలుగు ప్రజలు దాదాపు 1850 మంది, 45 జూమ్ (ZOOM Video) వేరు, వేరు విభాగాలలో 100 మంది జడ్జీలు పాల్గొని 128 గంటల నిడివిలో కార్యక్రమం జరిపి దిగ్విజయం చేసారు. ఇంత పెద్ద ఎత్తున అంతర్జాలంలో విజయవంతంగా నిర్వహించిన ఈ కార్యక్రమo “ఇండియన్ బుక్ అఫ్ రికార్డ్స్” లో “ఇండియన్ వరల్డ్ రికార్డ్” టైటిల్ ను మరియు ” ”తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్” లో స్థానం సంపాదించి చరిత్రలో నిలిచింది. ఈ మదర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నవివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు, పెద్దలకు, మహిళలకు, పిల్లలకు మరచిపోలేని తియ్యని జ్ఞాపకాల్ని మిగిల్చింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి గారు స్వాగతోపన్యాసం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

“అమ్మ అందమైన అనుబంధం.. అంతులేని అనురాగం.. మరపురాని మధుర జ్ఞాపకం.” అంటు అమ్మ గొప్పతనాన్ని కొనియాడారు. ప్రపంచమంతా ఒక సందిగ్ద పరిస్తితిని ఎదుర్కుoటున్న ఈ సందర్భంలో ఒకరికొకరు దూరంగా ఉన్నా మానసికంగా అమ్మకు ఎంత దగ్గరగా ఉన్నామో, అమ్మకు మన హృదయాలలో ఎoత గొప్ప స్థానముందో నిరూపించారన్నారు.

మే 16 న ప్రారంభోత్సవ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసి తమ అమూల్యమైన అనుభవాలను పంచుకుని శుభాకాంక్షలు తెలియజేసారు. ఇందులో పాల్గొన్నవారు …

•  విజయ భాస్కర్ – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాష మరియు సాంస్కృతిక శాఖ మాజీ డైరెక్టర్,
•  ఎల్ వి సుబ్రమణ్యం – ఐఎఎస్ అధికారి – ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ప్రభుత్వం- ప్రస్తుత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
•  అడుసుమల్లి రాజమౌలి ఐఎఎస్ – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మాజీ ప్రధాన కార్యదర్శి-ప్రస్తుత ప్రధాన కార్యదర్శి (ఎపి ప్రభుత్వం),
•  మాధవరావు పట్నాయక్ – న్యాయమూర్తి వినియోగదారుల కోర్టు (విజయవాడ),
• శ్రీమతి రాజని ప్రియా – ఎస్టేట్ మేనేజర్ – ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్-రాష్ట్రపతి భవని-భారత ప్రభుత్వం .

అలాగే మే 17 తేదీ రెండవ రోజు జరిగిన ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు విజేతలను అభినందిస్తూ బహుమతులు ప్రకటించి తమ సందేశాల్లో అమ్మతో తమకున్న మధురానుభూతులను నెమరువేసుకున్నారు. ఇందులో పాల్గొన్నవారు …
• పద్మవిభూషణ్ శ్రీ వరప్రసాద్ రెడ్డి, చైర్‌పర్సన్, సంత బయోటెక్,
•  విజయ భాస్కర్ – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్స్. భాష మరియు సంస్కృతి విభాగం డైరెక్టర్.
•  మన్మోహన్ సింగ్ ఐఎఎస్ ఎక్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ,
•  పి వి సునీల్ కుమార్, ఐపిఎస్ డిజి, చీఫ్, సిఐడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ,
• అదుసుమల్లి రాజమౌళి, ఐఎఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
• వి వి (జెడి) లక్ష్మి నారాయణ, ఐపిఎస్ ఎక్స్ జెడి సిబిఐ ,
• మెదసాని వెంకట్, చైర్మన్, APNRTS, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ,
•  రమేష్ బాబు పోతినేని, చైర్మన్, ప్రముఖ కార్డియాలజిస్ట్, రమేష్ హాస్పిటల్స్,
•  హిమాన్షు శుక్లా IAS జాయింట్ కలెక్టర్, వెస్ట్ గోదావరి, ఎక్స్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ టూరిజం
•  కోనేరు సత్యనారాయణ, కెఎల్‌యు విశ్వవిద్యాలయం చైర్మన్

ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసి పాలు పంచుకున్న తానా పూర్వ అధ్యక్షులు  జయరామ్ కోమటి,  గంగాధర్ నాదెళ్ళ, డాక్టర్ చౌదరి జంపాల,  సతీష్ వేమన గారు ప్రసంగించి తల్లులందరికీ శుభాకాంక్షలు తెలిపారు మరియు అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు బృందాన్ని అభినందించారు.

అలాగే ప్రస్తుత తానా కార్యవర్గం హరీష్ కోయ, తానా బోర్డు చైర్మన్, నిరంజన్ శృంగవరపు, తానా ఫౌండేషన్ చైర్మన్, అంజయ్య చౌదరి లావు , ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, రవి పొట్లూరి, కార్యదర్శి, లక్ష్మి దేవినేని, అంతర్జాతీయ మహిళా సమన్వయకర్త, మల్లి వేమన, కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్, తానా ఫౌండేషన్ ట్రస్టీలు విశ్వనాథ్ నయునిపాటి, సమన్వయకర్తలు సుమంత్ రామిశెట్టి, శ్రీధర్ తాళ్ళూరి, మురళి తాళ్ళూరి, సునీల్ పంట్రా, రాజా కసుకుర్తి తదితరులు తానా చేసిన వివిధ సేవల గురించి వివరిస్తూ పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందించారు. ప్రారంభోత్సవ మరియు ముగింపు ప్రోగ్రామ్‌లకు, శిరీషా తునుగుంట్ల మరియు భార్గవ్ (జిజ్ఞాస) వ్యాఖాతలుగా వ్యవహరించారు. ప్రోగ్రామ్ లీడ్స్ వివిధ విభాగాలలో విజేతలను ప్రకటించి మరియు పాల్గొన్న వారందరికీ మరియు న్యాయమూర్తులకు వారి విలువైన సమయాన్ని అభినందించారు.

శిరీష తునుగుంట్ల, మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి అహర్నిశలు పనిచేసిన అన్ని తానా రీజన్ల లోని ఉమెన్ ఫోరం సభ్యులు పద్మజ బెహర, హిమాబిందు కోడూరు, శ్రీలక్ష్మి మామిడిపల్లి, రేఖ ఉప్పుటూరి, మాధురి ఏలూరి, శ్రావణి, డాక్టర్ ఉమా కటికి మరియు “జిజ్ఞాస” సంస్థ డైరెక్టర్ భార్గవ గారు, వారి బృందానికి “జయహో భారతీయం” ఫౌండర్ శ్రీనివాస్ గారికి, ఆంధ్రప్రదేశ్ AP-NRTS సంస్థకు, న్యాయనిర్ణేతలను కోఆర్డినేషన్ చేసిన శ్రీనివాసరెడ్డి గారికి, బొమ్మలో అమ్మ చిత్రకళా విభాగానికి న్యాయనిర్ణేతలను కోఆర్డినేషన్ చేసిన కళాసాగర్ గారిని మరియు అన్ని రకాలుగా సహకరించి వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేసారు.

అలాగే ఈ కార్యక్రమానికి సాంకేతిక సహాయంతో పాటు, అన్నిరకాలుగా బాధ్యతలు తీసుకుని అండగా నిలచిన సుమంత్ రామిశెట్టి, న్యూయార్క్ RC గారికి, పృథ్వి చేకూరి, వంశీ వాసిరెడ్డి, సురేష్ మిట్టపల్లి గార్లకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

మరియు ప్రారంభ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన US1 TV, Sakshi TV వారికి మరియు ముగింపు కార్యక్రమాన్ని ప్రసారం చేసిన TV Asia బృందానికి, ప్రచారం చేసిన Telugu NRI Radio, Mana TV, Radio Vani బృందానికి తానా అధ్యక్షులు జయ్ తాళ్లూరి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.

ఈ సందర్భంగా “అమ్మ నీకు వందనం” కార్యక్రమం కోసం ప్రత్యేకంగా డా.శాంత కుమారి పాట రచించగా గాయకుడు సింగర్ రవిమండ ఆలపించి తల్లులందరికి అంకితం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap