సినీ పరిశ్రమకు అండగా ఏపీ ప్రభుత్వం

ఏపీ సిఎం జగన్ కు థాంక్స్ చెప్పిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్

కరోనాతో భారీగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. సినిమా థియేటర్లరు సంబంధించి విద్యుర్ చార్టీలు, వడ్డీ రాయితీలను మరికొంత కాలం పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల విద్యుత్ ఫిక్స్ చార్జీలకు మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన 6 నెలల ఫిక్స్ కరెంట్ చార్టీలను తక్షణమే చెల్లించకుండా వాయిదాలలో చెల్లించేలా, అలాగే ఏ , బి సెంటర్ థియటర్స్ వారు తీసుకున్న 10 లక్షల రూపాయల ఋణం, మరియు సి సెంటర్స్ వారు తీసుకున్న 5 లక్షల ఋణం పై ఉన్న వడ్డీ ని యాభై శాతం మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సినిమా థియేటర్ల యజమానులకు నిజంగా భారీ ఉరట లభించనుంది. ఈ నిర్ణయం ప్రకటించడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తెలుగు పరిశ్రమ, ఫిలిం ఛాంబర్ కృతజ్ఞతలు తెలియచేసింది.

ఈ సందర్భంగా బుధవారం ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రసిడెంట్ సి కళ్యాణ్ మాట్లాడుతూ, సిని ఇందు ప్రతినిధులు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని జూన్ లో కలిసాము. ఎపి లో సినిమాల షూటింగ్స్ కోసం అక్కడ పర్మిషన్ కావాలని చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, నేను, దామోదర్ గారు ఇలా చాలా మందిమి వెళ్లి కలిసాం. జగన్ గారు కూడావై ఎస్ తరహాలోనే ఏ నిర్ణయం అయినా వెంటనే చెప్పేస్తారు. అప్పుడు సినిమా థియేటర్స్ మూసివేస్తే రన్ లేకుండా మూసి వేసి ఉంటే మినిమమ్ చార్టీలు అని చెప్పి కోరడం జరిగింది. థియేటర్స్ ఓపెన్ అయేవరకు వాటిని తీయించాలి అని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇపదు మూడు నెలలకు మాత్రమే ఇచ్చారు. జగన్ గారిని మరోసారి కోరతాం, మాకు ఇక్కడ ఇద్దరు తండ్రులు. వారిద్దరిని కలుపుకుని ముందుకు వెళ్తున్నాం. మళ్ళీ కరోనా కష్టాలు మొదలయ్యాయి. జగన్ గారు ముందే గ్రహించి చెప్పారు. దాంతో మనం జర్నీ చేయాలనీ, అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకుని థియటర్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నాయి. రెండు ప్రభుత్వాలు మాకు అందిస్తున్న సపోర్ట్ విషయంలో ఆనందంగా ఉంది. అయితే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వైజాగ్ లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉందని, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి డ్రీం అది. దానికి సంబందించిన అన్ని విషయాలు పరిశీలిస్తున్నాం. మన పనులు జరగాలంటే ఇక్కడ ఉండి చేస్తే కుదరదు.. అక్కడికి వెళ్లి మన పనులు పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలి. జగన్ గారి కుటుంబం కూడా సినిమా రంగంతో అనుబంధం ఉంది… గతంలో మీరు డిస్ట్రిబ్యూటర్ గా చేసారు. మనమంతా ఒకటే కుటుంబం కాబట్టి సినిమా పరిశ్రమ విషయంలో మీ సపోర్ట్ ఇంతా అవసరం. అలాగే ఈ విషయంలో సపోర్ట్ చేసిన వారికి కూడా నా ధన్యవాదాలు అన్నారు.

ఈ కార్యక్రమంలో చలనచిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శి కె.ఎల్. దామోదర్ ప్రసాద్, ఫిలిం ఛాంబర్ వైస్ ప్రసిడెంట్ ముత్యాల రాందాస్, జాయింట్ సెక్రెటరీ సి. భరత్ చౌదరి, నిర్మాతల సెక్టార్ చైర్మన్ ఏలూరు సురేందర్ రెడ్డి, ఫిలిం ఛాంబర్ గౌరవ సంయుక్త కార్యదర్శి జి వీర నారాయణ్ బాబు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ గౌరవ కార్యదర్శి మోహన్ వడ్లపట్ల, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్, ట్రెజరర్ టి. రామసత్యనారాయణ పాల్గొన్నారు.
-సురేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap