యూట్యూబ్లో మహేశ్ కూతురు సందడి…

టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు కూతురు సితార సొంతంగా యూట్యూబ్ లో ఓ చానల్ ప్రారంభించింది. తన ఫ్రెండ్ తో కలిసి A&S అనే పేరుతో చానల్ ను నిన్ననే ప్రారంభించారు. ఇందులో ‘A’ అంటే ఆద్య. ఈ అమ్మాయి ఎవరో కాదు దర్శకుడు వంశీ పైడిపల్లి (మహర్షి సినిమా దర్శకుడు) కుమార్తె. ‘S’ అంటే సితార. ఆద్య, సితార మంచి ఫ్రెండ్స్ కావడంతో తమ పేర్లలోని మొదటి అక్షరాలతో A&S యూట్యూబ్ చానల్ ఆరంభించారు. మొదటి వీడియోగా ‘3 మార్కర్స్ చాలెంజ్’ పేరుతో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

చిన్నారులను ఆకట్టుకునేలా బొమ్మలకు రంగులు నింపడంలో సితార, ఆద్య పోటీలు పడ్డారు. యూట్యూబ్ లో ఈ వీడియోకు ఇప్పటికే వేలల్లో వ్యూస్ వస్తున్నాయి. ఈ గుడ్ ఫ్రెండ్స్ కోసం మహేశ్ బాబు కూడా రంగంలోకి దిగారు. సితార, ఆద్య రూపొందించిన వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేసి… ఇద్దరు చిన్నారులకు శుభాకాంక్షలు చెప్పారు. ఎంతయినా సెలబ్రిటి పిల్లలు కదా వీడియోని పోస్టు చేసిన ఒక రోజులోనే 70 వేల వ్యూస్ వచ్చాయి. పిల్లలు ఇష్టపడే చక్కని బ్యాక్డ్రాప్తో రూపొందించిన ఈ తొలి వీడియోని మీరు కూడా ఒక లుక్కేయండి.

SA: