(పద్మశ్రీ లక్ష్మా గౌడ్ గారి పుట్టిన రోజు సందర్భంగా….)
చిత్రకళా ప్రపంచంలో తనదైన రేఖతో, తన్మయపరచే రంగుల పూతతో, నూట్లాడని బొన్ములతో కోటి భావాలు పలికించే చిత్రకారుడు కె.లక్ష్మాగౌడ్. ఆయన పల్లెదనాన్ని కళ్లనిండా నింపుకున్నారు. శృంగార రసాన్ని కాన్వాసుపై ఒంపుతున్నారు. సంస్కృతికి అద్దంపట్టే బొమ్మలతో తన భావాలని మేళవించి సృజించారు. ఎన్నో ఏళ్ల ప్రయాణంలో ఎన్నెన్నో కళాఖండాలు ఆవిష్కరించిన కళాశ్రామికుడాయన. 2016 లో కేంద్ర ప్రభుత్వం లక్ష్మా గౌడ్ ‘పద్మశ్రీ’ ప్రకటించింది. ఎన్నో మైలురాళ్లు దాటిన ఆ కుంచె ప్రయాణమిది.
నిజాంపూర్ పేరుతో ఆయన గీసిన చిత్రాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. రాష్ట్రంలో నిర్వహించిన అనేక ప్రదర్శనల్లో అనేకసార్లు బంగారు పతకాలు సాధించారు లక్షాగౌడ్. జీవిత సాఫల్య పురస్కారంతో పాటు తెలంగాణ రాష్ట్ర పురస్కారం కూడా అందుకున్నారు. అంతర్జాతీయంగా భారతీయ సంస్కృతిని వర్ణించే బాధ్యత తనదే అన్నట్లు, 1873లో లండన్లో తన చిత్రాల విదేశీ ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు. ఆ పరంపరలో వార్సా బుడాపెస్ట్, మ్యూనిచ్, టోక్యో, బ్రెజిల్, ఆమ్స్టర్డామ్ల సాక్షిగా కొనసాగుతూనే తొలినాళ్లనుంచీ సామూహిక ప్రదర్శనలు పదుల సంఖ్యలో చేశారు. శృంగార భావన కలిగించే చిత్రాలు గీశారే ఆవి అందరికీ ఆమోదయోగ్యమేనా అనే ప్రశ్న తలెత్తినప్పుడు… ‘మన సంస్కృతిలో భాగమైన అంశాల మీద నా కుంచె స్పందన ఆది. వాటిని కళాదృష్టితోనే చూడాలి’ అంటారాయన. తాను పుట్టి పెరిగిన నిజాంపూర్ తీరుతెన్నులు, అక్కడి జనజీవనం, పనులూ, వ్యాపకాలే ఆయన్ని నిత్యం ప్రేరేపిస్తాయి. గురుతుల్యులు జగదీష్ మిట్టల్ వద్ద తనివితీరా చూసిన కళాఖండాలూ స్ఫూర్తినింపేవే. పికాసో పాల్ వీక్లీ చిత్రాలంటే ఇష్టపడే ఆయన వారి ప్రభావం తనమీద ఉందన్నారంటే దానికి అధివాస్తవికత గల చిత్రాలే నిదర్శనం. ఆయన గీసిన నిండైన పొదుగులతో ఉన్న మేకల చిత్రాలు గ్రామీణ భారతావనికి ప్రతీకలు. ఆయన చిత్రాలు మానవుడి చిత్త ప్రవృత్తులను నిఖార్సయిన కోణంలో ఆవిష్కరిస్తాయి. యువ చిత్రకారులు ఒక దృక్పథం ఏర్పరచుకోవాలి, సృజన, కొత్తదనం, ప్రయోగాల వైపు పరుగులు తీయాలని కాంక్షించే వ్యక్తి ఆయన. 82 సంవత్సరాల వయస్సులోనూ నిత్య ప్రయోగాలతో లక్ష్మాగౌడ్ తన సృజనను కొనసాగించాలని 64కళలు.కాం కోరుకుంటుంది.
– కళాసాగర్
View Comments (1)
ప్రఖ్యాతమైన శ్రీ లక్ష్మాగౌడ్ గారు మన తెలుగువారు కావడం ఎంతో గర్వకారణం.