* జనవరి 28 న విజయవాడలో – వాసవ్య మహిళామండలి ‘స్వర్ణోత్సవం ‘
* ముఖ్య అతిథిగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
* మహిళాభ్యున్నతికై 1969 లో ప్రారంభించిన చెన్నుపాటి విద్య
* స్వర్ణ జయంతి వేడుకల సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ప్రదానం
ఆంధ్రప్రదేశ్ మహిళామిత్ర
వాసవ్య మహిళా మండలి పేరిట నిస్సాహాయ మహిళలకు, బాలికలకు అండగా నిలిచి, స్వచ్ఛంధంగా వారిని ఉద్యోగినులుగా, విద్యావంతులుగా తీర్చిదిద్దటంలో జాతీయస్థాయిలో పేరుగాంచిన కీ.శే. శ్రీమతి చెన్నుపాటి విద్యగారు మరో అడుగు ముందుకేసి, నేడు నాగరిక సమాజంలోనూ నానాటికీ పెరిగిపోతున్న మితిమీరిపోతున్నటువంటి మహిళలు ఎదుర్కొంటున్న అత్యాచారాలు, అవమానాలు, గృహహింసతో, ఆకతాలయి వేధింపులు, వివక్షలు అభద్రత వంటి అనేక సమస్యలను రూపుమాపే ఆలోచనతో మన దేశంలో, రాష్ట్రంలో ప్రధమంగా “మహిళామిత్ర” అనే ఓ వినూత్న స్వచ్ఛంద సేవా విభాగానికి 2017 నాటి విజయవాడ పోలీస్ కమీషనర్ శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపిఎస్ గారి సహాయంతో రూపకల్పన చేశారు. ఈ మహిళా మిత్ర నేరుగా పోలీసువారిని ఆశ్రయించలేని స్త్రీలకు సహాయకారిగా వుంటూ, వారికి, పోలీసువారికి మధ్య ఓ అనుసంధాన సంస్థగా కూడా తన సేవలందిస్తుంది.
మహిళల రక్షణ, మహిళలకు స్వయం ఉపాధి కల్పన అనేక వృత్తులలో ఉచిత రీతిన శిక్షణలు అందించటంలో మహిళామిత్ర సక్రియపాత్ర పోషిస్తుంది. బాధిత మహిళలకు సంబంధిత న్యాయపరమైన సహకారం అందే విధంగా మహిళా మిత్ర బాధ్యత వహిస్తుంది.
గాంధేయ మార్గంలో మహిళాభ్యున్నతికై మహిళలచే గత 50 సంవత్సరములుగా విజయవంతంగా నిర్వహించబడుతున్న ప్రభుత్వేతర, నిస్వార్ధ సామాజిక సేవాసంస్థ.
ఇప్పటివరకు ఈ సంస్థ ద్వారా 36లక్షలకు పైగా మహిళలు, బాలికలు సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా లబ్ధిపొందటం ప్రత్యేకంగా ప్రస్తావించదగిన విషయంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు గుర్తించి, స్వర్ణ జయంతి వేడుక సమయంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ను ప్రదానం చేయనున్నారు.
View Comments (2)
Congrats to Organizers.
Congrats the whole team.