శ్రీధర్ తెలుగు దిన పత్రికలలో పొలిటికల్ కార్టూనిస్టు అవసరాన్నే కాదు, కార్టూన్ల ప్రాముఖ్యాన్ని పెంచి, నాలుగు దశాబ్దాలుగా ‘ఈనాడు’ దినపత్రికలో కార్టూన్లు గీస్తూ లక్షలాది పాఠకులను తన కార్టూన్లతో అలరిస్తున్న కార్టూనిస్టు శ్రీధర్. 1979లో ‘సితార’ సినిమా పత్రికకు లే అవుట్ ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరి ‘సితార’, ‘విపుల’లలో కార్టూన్లు గీసి రామోజీరావు గారి దృష్టిలో పడి వారి ప్రోత్సాహంతో 1981 నుండి ఈనాడు దినపత్రికకు పాకెట్ కార్టూన్లు వేయడం ప్రారంభించారు. అందుకే “నన్ను కార్టూనిస్టును చేసింది రామోజీరావు గారే అంటారు శ్రీధర్”. ది. 11 మే 2019 నాటికి నలబైయేళ్ళ పాటు ఒకే పత్రికలో కార్టూన్లు గీసి సరికొత్త రికార్డ్ నెలకొల్పారు.
నల్గొండ జిల్లాలో పుట్టిన శ్రీధర్, పొలిటికల్ సైన్స్లో ఎం.ఏ. చేశారు. వీరి పూర్తి పేరు శ్రీధర్ రావు. డేవిడ్లో, శంకర్, ఆర్.కె. లక్ష్మణ్ నా అభిమాన కార్టూనిస్టులని, లక్ష్మణ్ ప్రభావం తన బొమ్మలపై విశేషంగా ఉందని చెప్పుకుంటారు. ప్రతిష్టాత్మక బెల్జియం కార్టూన్ ఉత్సవంలో ప్రదర్శనకు మూడేళ్ళు శ్రీధర్ కార్టూన్లు ఎంపిక కాబడి 2002 సం. లో బెల్జియంకు ఆహ్వానించబడ్డారు.
సెన్సాఫ్ హూమర్ అనేది మన రక్తంలో ఉంది, మన సాహిత్యంలో ఉంది, మన నిత్య జీవితంలో ఉంది. ఆ సెన్సాఫ్ హూమరే కార్టూనిస్టును ఆదరిస్తుందంటున్న శ్రీధర్ కార్టూన్ సరదాగా నవ్వుకోవటానికే కాదు, సీరియస్గా ఆలోచించటానికి కూడా ఉపకరిస్తుందని అంటారు శ్రీధర్.
-కళాసాగర్
View Comments (3)
Nice article sir
article bagundi simple ga
Very nice arrival... Kala sagar garu