శ్రీ చిన్న శ్రీపతి (48) గారు, నివాసం శ్రీనగర్ కాలనీ, అమీర్ పేట, హైదరాబాద్.
వృత్తి-ప్రవృత్తి “చిత్రకళ”. కళ లోనే సర్వస్వం. తంజావూర్, కాన్వాస్ పేయింటింగ్స్, పెన్సిల్ మొదలగు మాద్యమాలతో సంపూర్ణంగా చిత్రించగల పనిమంతుడు. కళలో పట్టు, పరిపూర్ణత్వం కలిగిన కళాకారుడు. కేవలం పెన్సిల్ తోనే అద్భుత కళాఖండాలను తయారు చెయ్యవచ్చుంటున్నారు శ్రీపతి గారు.
రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. 236 సార్లు గ్రూప్ షోలు కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసారు. కాన్వాస్ పేయింటింగ్స్ దాదాపుగా 1400 లకు పైగానే సేల్ అయ్యాయని,
తంజావూర్ పేయింటింగ్స్ రమారమి ముప్పై వేలకు పైగానే అమ్ముడు పోయ్యానని, అందుకే ఈ రంగంలో ముఖ్యంగా నూటికి నూరు శాతం సంతృప్తిగానే వున్నదంటున్నారు. ప్రస్తుతం చేతిలో తొంభై వరకు ఆర్డర్స్ వున్నాయి, ఇప్పుడు ఆ పనిలోనే వున్నానని తెలిపారు. ఆర్డర్ పై తీసుకున్నవి 4-5 పూర్తయ్యాయి, అవి మాత్రమే నా దగ్గరున్నాయి. అలాగే దేనికీ సరైన సమయం చాలడం లేదని కించిత్ అసంతృప్తి కూడా వుందంటున్నారు శ్రీపతి గారు.
ఆర్టిస్టు అనేవాడు ప్రాట్టికల్ గా టైమ్ పెట్టుకొని వర్క్ చేస్తాడు. అలా చేయడం అది కమర్షియిల్ అవుతుంది. అందువల్ల అవుట్ పుట్ క్లియర్ గా రాదు. ఆర్టిస్టు సక్సస్ కాకపోవడానికి ముఖ్యమైన కారణం. చాలామంది ఏమి చేస్తుంటారంటే, ఎంతసేపు ఇంట్లోనే కూర్చొంటారు. హైదరాబాద్ లో అదే జరుగుతుంది. పేయింటింగ్స్ తో బయటకు వెళ్లరు. పేయింటింగ్స్ మాత్రం అమ్ముడు పోవాలి. కొంతమందయతే బయటకు వెళ్లకుండానే గుర్తింపు రావాలి. ఫేమస్ అయిపోవాలి. అన్నీ జరగాలంటారు బయటకు వెళ్లకుండానే.
ఉదా: నా విషయంలో, పోయిన సంవత్సరం ఢిల్లీలో ఓ ఎగ్జిబిషన్ లో నా వర్క్ తంజావూర్ పేయింటింగ్స్ లలో ఒకదానిని ఓ బయ్యర్ చూసి ఎంతని అడిగితే నేను ఓ రేట్ చెప్పాను. ఆయనా ఓ రేటుకు అడిగాడు. నేను ఇవ్వలేదు. బయ్యర్ రోజూ వచ్చి చూసి వెళుతున్నాడు. సేల్ అయ్యిందా…లేదా అని….లాస్ట్ డే రోజున కూడా వచ్చాడు. నేను చెప్పిన రేటుకే తీసుకొని వెళ్లాడు. అంటే ఆ బయ్యర్ కు ఆ పేయింటింగ్ బాగా నచ్చింది. అదే నేను ఢిల్లీకి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొంటే, అది సేల్ అయ్యేదా….. ఆ రేటు వచ్చేదా….
నేను పడుకునే ముందు రెండు గంటలపాటు నాతో నేను మట్లాడుకుంటా. నేను చేసింది సరయినదా కాదా…..నాకు తెలిసినంతవరకు నాకు నేనే బెస్ట్ ఫ్రెండ్. నా గురించి తెలిసినంతగా ఎదుటి మనిషికి తెలియదు. అందుకే నాలో ఉన్న తప్పులు సరిదిద్దుకుంటాను. నా పనిలో నైపుణ్యాన్ని పెంచుకుంటాను.
ఇకపోతే “నేను ఓ ప్లాన్ చేస్తున్నాను. ముందు పెన్సిల్ డ్రాయింగ్ తో పర్ఫెక్షన్ దగ్గర నుంచి తంజావూర్ బోర్డ్ తయారు చేసే ప్రాసెస్ తో పాటు తంజావూర్ పేయింటింగ్స్ లో, 2/3 నెలలకు ట్రయినింగ్ ఇచ్చే ఆలోచనలో వున్నారని” తెలిపారు శ్రీపతి గారు.
చివరిగా మరో ముఖ్యమైన ఆలోచనలను ఈ సందర్భంగా తెలియజేసారు.
– తన పేయింటింగ్స్ ద్వారా రామాయణం సిరీస్ తో దాదాపుగా 45-50 ఫ్రేములుతో ఎగ్జిబిషన్ ను ఎప్పటికైనా ఏర్పాటు చేయ్యాలని.
– శనీశ్వరునికి తన సొంత చిత్రకళతో దేవాలయం కట్టాలని.
డా. దార్ల నాగేశ్వర రావు
View Comments (3)
Great...
Truthfully
Yes true