ఒక్క సినిమాకే ‘పద్మభూషణ్ ‘

కలర్‌ ఫొటో చిత్రంతో హీరోగా ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడీ యంగ్‌ హీరో. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కడంతో సుహాస్‌ నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇక తాజాగా సుహాస్‌ మరో చిత్రంలో నటించనున్నాడు.

ప్రతిభావంతులైన కొత్త వాళ్లను పరిచయం చేస్తూ సంయుక్త భాగస్వామ్యంతో చిత్రాలు నిర్మిస్తామని ఇటీవల చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి ఫిలిమ్స్ అనౌన్స్ చేశాయి. నూతన సంవత్సరం సందర్భంగా నేడు తమ తొలి చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’ను అనౌన్స్ చేస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆ బ్యానర్స్ రిలీజ్ చేశాయి. ‘కలర్ ఫొటో’ సినిమాలో చేసిన అద్భుతమైన అభినయంతో ఆకట్టుకున్న విజయవాడ కుర్రాడు సుహాస్, ‘రైటర్ పద్మభూషణ్’గా టైటిల్ రోలను పోషిస్తున్నారు. షణ్ముఖ ప్రశాంత్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని అనురాగ్, శరత్, చంద్రు మనోహర్ నిర్మిస్తున్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్లో వర్ధమాన రచయిత పద్మభూషణ్ గా సుహాస్ కనిపిస్తున్నారు. ఆయన చేతిలో తను రాసిన తొలి పుస్తకం ‘తొలి అడుగు’ కనిపిస్తోంది. చూడ్డానికి సింపుల్ గా ఉన్నా, సినిమా కాన్సెప్ట్ పై ఆసక్తిని రేకెత్తిస్తూ ఆకట్టుకుంటోంది పోస్టర్. త్వరలో షూటింగ్ మొదలుకానున్న ‘రైటర్ పద్మభూషణ్’, 2021 మధ్యలో విడుదల కానున్నది. చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి మ్యూజిక్ సంయుక్త భాగస్వామ్యంలో నిర్మాణమయ్యే చిత్రాల ద్వారా 2021లో మరికొంతమంది ప్రతిభావంతులైన యువదర్శకులు పరిచయం కాబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap