గ్రామీణ చిత్రకారుల్లో ఎనలేని ప్రతిభ 

గ్రామీణ చిత్రకారుల్లో ఎనలేని ప్రతిభ 

విశాఖ జిల్లా చోడవరంలో జాతీయస్థాయి చిత్రలేఖన ప్రదర్శన  ప్రథమ బహుమతి అమలాపురం చిత్రకారుడికి.. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉంటుందని, దాన్ని చిత్రలేఖన ప్రదర్శన పోటీల ద్వారా వెలికి తీయాల్సిన అవసరం ఉందని చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు పేర్కొన్నారు. స్థానిక ప్రేమ సమాజంలో  చోడవరం చిత్రకళా నిలయం, విశ్రాంత చిత్రలేఖన ఉపాధ్యాయులు బొడేట్టి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఫోరం…

మహోన్నత చిత్రకారుడు పద్మశ్రీ కృష్ణా రెడ్డి

మహోన్నత చిత్రకారుడు పద్మశ్రీ కృష్ణా రెడ్డి

రాజమండ్రి చిత్రకళా నికేతన్ ఆధ్వర్యంలో జరిగిన సంస్మరణ సభ విశేషాలు చిత్రకళలో ఒక విశిష్టమైన ప్రక్రియ ప్రింట్ మేకింగ్ . ఎంతో పురాతనం మరియు విశిష్టమైన ఈ ప్రక్రియలో జీవిత కాలం అద్భుతమైన ఎన్నో ప్రయోగాలు చేసి మనదేశం కంటే అంతర్జీయంగా గణనీయమైన ఖ్యాతి గడించిన గొప్ప భారతీయ చిత్రకారుడు పద్మశ్రీ కృష్ణారెడ్డి ఇటీవల ఆగస్ట్22వ తేదీన న్యూయార్క్…

గాంధీ జయంతి ఉత్సవాలు

గాంధీ జయంతి ఉత్సవాలు

150 వ గాంధీ జయంతి ఉత్సవాల సందర్భముగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ & ఆర్ట్ అసోసియేషన్ (గిల్డ్) వారు ఘంటసాల సంగీత , నృత్య కళాశాల, విజయవాడ లో జాతి పిత గాంధీ -ఆశయాలు అనే అంశంపై నిర్వహించిన చిత్ర లేఖన పోటీలో ఒంగోలు సృష్టి ఆర్ట్ అకాడమీ విద్యార్థులు ఆదిపూడి సిస్టర్స్ … ఆదిపూడి దేవిశ్రీ (9వ…

మోహన్ సంస్మరణ సభ

మోహన్ సంస్మరణ సభ

ఆర్టిస్ట్ మోహన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరు 1930 డిసెంబర్ 24 పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పుట్టారు. ఏలూరు సి. ఆర్. రెడ్డి కాలేజ్ బి.ఎస్సీ అయ్యాక, విజయవాడ విశాలాంధ్ర దినపత్రికలో సబ్ చేరారు. చిన్ననాటి నుండి బొమ్మలు వేసే అలవాటు విశాలాంధ్రలో పదేళ్ళు జర్నలిస్లుగా, కార్టూనిస్టుగా పనిచేశాక హైదరాబాద్ ఆంధ్రప్రభ లో పొలిటికల్ కార్టూనిస్టుగా…

అక్కినేని పురస్కారం అందుకున్న గీతాంజలి

అక్కినేని పురస్కారం అందుకున్న గీతాంజలి

డా. అక్కినేని నాగేశ్వరరావు పురస్కారం నాటక కళాపరిషత్ 24 వ ఉభయ తెలుగు రాష్ట్రాల నాటక పోటీలు సెప్టెంబర్ 10 నుండి 12 వరకు విజయవాడ ఘంటసాల సంగీత కళాశాల లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డా. అక్కినేని జీవన సాఫల్య పురస్కారం నటి శ్రీమతి గీతాంజలి కి మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ శ్రీ కొనిజేటి రోశయ్య…

విజయవాడలో  ఆవిర్భవించిన నవ్యాంధ్ర రచయితల సంఘం

విజయవాడలో ఆవిర్భవించిన నవ్యాంధ్ర రచయితల సంఘం

విజయవాడ బందరురోడ్డులోగల ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో నవ్యాంధ్ర రచయితల సంఘం ఆవిర్భావ వేడుకలు సెప్టెంబరు 8వ తేదీ ఉదయం 10 గంటలకు మొదలయ్యాయి. రెండు రోజులపాటు జరుగనున్న ఈ వేడుకల్లో మొదటిరోజు వేడుకలకు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలనం చేసి వేడుకల్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ-…

స్వాతంత్రభారతికి చిత్రకళాహారతి

స్వాతంత్రభారతికి చిత్రకళాహారతి

September 12, 2018

హిమశైల శిఖరం ఎలుగెత్తి పిలిచింది సాగరం ఎదపొంగి స్వాగతం పలికింది ఓ భారతీయుడా స్వాతంత్ర పౌరుడా ఏ జన్మ పుణ్యమో ఈ తల్లి నీదిరా… స్వేచ్ఛాభారతిని కాంక్షించి, లక్షలాదిమంది ప్రాణాలర్పించిన మహోజ్వలమైన ఘట్టం భారత స్వాతంత్ర పోరాటం. ఆంగ్లేయుల పాశవికమైన పాలన నుండి, మన మాతృభూమిని విముక్తం చేయాలని, మనసారా విశ్వసించి తమ జీవితాలను తృణప్రాయంగా ధారపోసిన వీరులు ఎందరో…వీరనారీమణులు మరెందరో. వందేమాతరమంటూ చెరసాలల్లో చిత్రహింసలు అనుభవించిన దేశభక్తులు, జాతీయపతాకాన్ని చేతబూని మండుటెండల్లో బ్రిటీష్ పాలకుల కొరడా దెబ్బలకు శరీరమంతా రక్తం ధారలు కట్టిన త్యాగధనులు ఎందరో.. ఎందరెందరో.. చేతిలో భగవద్గీతతోఉరికంబాల పై ప్రాణాలనర్పినూ, ఏనాటికైనా ఈ భారతదేశం స్వతంత్రం కావాలని మనసారా వాంఛించిన మహితాత్ములు ఇంకెందరో… ఈ దేశభక్తుల, ఈ ధర్మమూర్తుల, ఈ కర్మవీరుల, ఈ త్యాగధనుల త్యాగాల ఫలమే, పోరాటాల ఫలితమే, ప్రపంచ చరిత్రలోనే తిరుగులేనిమహోజ్వలమైన అధ్యాయం భారత స్వరాజ్య సంగ్రామం. ఈ త్యాగధనులకు, ఈ కర్మధనులకు, ఈ పుణ్యపురుషులకు, ఈ సహృదయమూర్తులకు నివాళి సమర్పించడం మనందరి కర్తవ్యం. గురుతరమైన బాధ్యత, ఇది నిస్సందేహం.  ఈ 72వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా,ఈ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడానికి, ఓ వినూత్నమైన ఆలోచన చేశారు. డా. దీర్దాసి విజయభాస్కర్. ఆంధ్రప్రదేశ్భా షా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో, ఓ గొప్ప కార్యక్రమానికి సంకల్పించారు. స్వరాజ్యవీరులకు ఘననివాళి సమర్పించాలని నిశ్చయించారు. అదిగో… అలా.. డా.విజయభాస్కర్ సంకల్పం నుండి ఉ ద్భవించింది. “స్వాతంత్ర భారతికి చిత్రకళాహారతి” అనే విశిష్టమైన కార్యక్రమం. అజ్ఞాతులైన ఎందరో స్వాతంత్ర్య వీరుల, దివ్య రూపాలకు ప్రాణప్రతిష్ఠ…